సిరాన్యూస్, బేల
బేలలో భక్తిశ్రద్ధలతో కావడి యాత్ర
ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో శ్రావణమాసం సందర్భంగా శనివారం కావడి యాత్ర భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, నైవేద్యాలతో పూజలు చేసి స్త్రీలు కాలినడన గంగా జలాన్ని తీసుకొచ్చి ఆలయంలో అభిషేకం చేశారు. ఈ పవిత్రమైన శ్రావణమాసంలో కావడి యాత్ర చేస్తే పాడి పంటలు సుఖ సంతోషాలు, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. కావడి యాత్ర భక్తులు నిర్వహించగా బేలా ఆయా ప్రాంతాల వీధుల్లో పండగ వాతావరణం నెలకొంది.ఈ కావడి యాత్రలో మహిళలు, పెద్దలు, యువకులు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.