సిరా న్యూస్, బేల
బేలలో విత్తనాల కోసం రైతులు పడిగాపులు
* విత్తనాల దుకాణం ఎదుట రైతుల క్యూ
* ప్రభుత్వం నిర్లక్ష్యంపై రైతుల మండిపాటు
విత్తనాల కోసం రైతులు మళ్లీ పడిగాపులు కాస్తున్నారు. సాగు కోసం సన్నద్దమవుతున్న రైతులు గంటల పాటు షాపుల ఎదుట క్యూలో నిలబడాల్సిన దుర్భర స్థితి నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో రైతులు విత్తనాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్ని గ్రామల రైతులకు ఒకే వద్ద విత్తనాలు ఇవ్వడంతో ఎండలో ఉండాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 7గంటలకు మండల కేంద్రంలో నీలేష్ ఆగ్రో ఏజెన్సీ వద్దకు చేరుకోని రాశి 659 కోసం వస్తే రైతులకు కేవలం ఒకే ఒక బస్తానే రైతులకు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల రెండు, మూడు, నాలుగు ఎకరాలున్న రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకొని రైతులకు సరిపడా రాశి 659 విత్తనాలను సప్లై చేయాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఇతర గ్రామాల నుండి పొద్దున వచ్చినం అయినా విత్తనాలు దొకడం లేదు. ఇక్కడ దాదాపు వెెయ్యి మంది ఉన్నాం.అసలు విత్తనాలు దొరుకుతాయో లేదో కూడా తెలియదు. ఒక్కరికి ఒక్క బ్యాగు మాత్రమే ఇస్తున్నారు. ఎక్కువ పొలం ఉన్న వారికి కష్టమవుతుంది. కానీ లోపల ఎన్ని బస్తాలు ఉన్నాయో అవి మాకు అందుతాయో లేదో తెలియదు అని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ అధికారులు, పోలీసులు దగ్గరుండి చూడాల్సిన బాధ్యత వారి పైన ఉంది. కానీ అధికారులు ఎవ్వరు కూడా ఇక్కడ కనిపించడం లేదని రైతులు మండి పడుతున్నారు.