సిరా న్యూస్, బేల:
పేదల సంక్షేమమే ధ్యేయంగా మద్యంతర బడ్జెట్
నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆదిలాబాద్ జిల్లా బేల మండల బీజేపీ అధ్యక్షుడు దత్తా నిక్కం అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన మద్యంతర బడ్జెట్ను ఆయన దేశ ప్రగతి, సంక్షేమానికి కొనసాగింపుగా అభివర్ణించారు. ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన వికసిత్ భారత్కు మూల స్తంబాలైన యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారతే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించడం జరిగిందన్నారు. పేద, మద్య తరగతి జీవులపై భారం పడకుండా ప్రగతిశీల బడ్జెట్ను ప్రవేశ పెట్టిన మంత్రి నిర్మల సీతారామన్కు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సైతం బీజేపీకి భారీ మెజార్టీ ఖాయమనీ, ప్రజలంత బీజేపీ వెంటే ఉన్నారని ఆయన ఒక ప్రకటణలో తెలిపారు.