Bela Shobhayatra: బేలలో అంబరాన్నంటిన సంబరాలు…

సిరా న్యూస్, బేల:

బేలలో అంబరాన్నంటిన సంబరాలు…

ఆదిలాబాద్‌ జిల్లా బేల మండల కేంద్రంతో పాటు మండలంలోని డోప్టాల, అవల్పూర్, సిర్సన్న, పాఠన్, తదితర గ్రామాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా బేల మండల కేంద్రంలో సోమవారం ఉదయం పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించారు. రామాంజనేయ విగ్రహాలను పల్లకిలో ప్రతిష్ఠించి అశోక్‌ నగర్‌ కాలనీ నుండి గ్రామంలోని ప్రధాన వీదుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో ముందుకు సాగగా, యువకులు భజన చేసారు. జై శ్రీ రాం అంటూ నినాదాలు చేస్తూ, కాషాయా జెండాలతో హోరెత్తించారు. కాగా గ్రామంలోని రామాలయంలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్క్రీన్‌పై అయోద్యలో ప్రధానమంత్రి మోడీ పూజాధి కార్యక్రమాలను లైవ్‌లో చూసి తరించారు. భక్తుల కోసం పెద్ద ఎత్తున అన్నదానం గావించారు. ఈ సందర్భంగా గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. సాంస్కృతి కార్యక్రమాలు, భక్తుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *