జిల్లా కలెక్టర్ సగిలి సన్మోహన్
సిరా న్యూస్,చిత్తూరు;
ఈ మేరకు బుధవారం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన సందర్బంగా పంపిణీలో మార్పులు వచ్చాయని, గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో నిరాధారమైన ఆరోపణలతో అపోహలతో లబ్దిదారుల్లో ఆందోళన సృష్టిస్తున్నారన్నారు. ఇవ్వాళ్ళ మధ్యాహ్నం లోపు రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ కార్యదర్శుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేస్తుందని, నగదును బ్యాంకు ఖాతాల నుండి డ్రా చేసుకుని, మధ్యాహ్నం అయా గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్ పథకం లబ్దిదారులకు సొమ్మును పంపిణీ చేస్తారని తెలిపారు. పంపిణీకి సుమారు 10 రోజులు పడుతుందని, అందరికీ పంపిణీ చేస్తారని చెప్పారు. పెన్షన్ పంపిణీకి సంబంధించి కలెక్టరేట్ లో కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కలెక్టర్ వెంట జేసీ పులి శ్రీనివాసులు, డీఅర్ డిఎ.పిడి.తులసి పాల్గొన్నారు.
===========