ఆధునిక చికిత్స పద్ధతులతో మెరుగైన చికిత్సలు

– డాక్టర్ విజయ్ భాస్కర్
 సిరా న్యూస్,హైదరాబాద్;
నానాటికి అందుబాటులోకి వస్తున్న ఆధునిక చికిత్స పద్ధతులతో రోగులకు నాణ్యమైన చికిత్సలు అందించగలుగుతున్నట్లు క్యాన్సర్ వైద్య నిపుణులు విజయ్ భాస్కర్ అన్నారు. జూబ్లీహిల్స్ లోని దశపల్ల హోటల్లో ఇండోబ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ ఆధ్వర్యంలో క్యాన్సర్ రోగుల్లో నొప్పి నివారణ – అధునాతన పరిశోధనలు అనే అంశంపై ప్రత్యేక సెమినార్లు నిర్వహించారు. నగరంలోని పలువురు క్యాన్సర్ నిపుణులు ఈ కార్యక్రమానికిహాజరయ్యారు. ఈ సందర్భంగా విజయభాస్కర్ మాట్లాడుతూ క్యాన్సర్ బారిన పడి వివిధ రకాల చికిత్సలు పొందుతున్న రోగులు తీవ్రమైన నొప్పితో విలవిలాడుతుంటారని అన్నారు. ముఖ్యంగా రేడియేషన్ వంటిచికిత్సలు తీసుకుంటున్న వారిలో క్లిష్టమైన నొప్పులు వారిని మానసిక ఒత్తిడికి గురి చేస్తుంటాయని అన్నారు. ఇతర వైద్య చికిత్సలో లాగానే నొప్పులతో బాధపడుతున్న వారికి నాణ్యమైన చికిత్సలు అందుబాటులోఉన్నాయని చెప్పారు. మందులతో పాటు వివిధ రకాల తెరఫీల తో రోగికి నొప్పిలేని జీవితాన్ని అందించవచ్చునని అన్నారు. జీవిత చరమాంకంలో హాయిగా జీవించేందుకు తాము చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *