సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
అప్పుల బాధతో బెజ్జారపు గంగాధర్ మృతి
అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ టౌన్ విద్య నగర్ లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. విద్యానగర్కు చెందిన చెందిన బెజ్జారపు గంగాధర్ (48) అనే వ్యక్తి అప్పుల బాధ భరించలేక బుధవారం సాయంత్రం 07:30 గంటల ప్రాంతం లో తన షాప్ లో యాసిడ్ త్రాగి ఆత్మహత్యం ప్రయత్నం చేశాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే చికిత్స నిమిత్తం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడి నుండి నిర్మల్ ఆసుపత్రి కు తీసుకెళ్లారు. నిర్మల్ లో కూడా చికిత్స కాదని గాంధీ ఆసుపత్రి హైదరాబాద్ కి తీసుకెళ్ళి చికిత్స చేయిస్తున్నారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం 07:25 గంటల ప్రాంతం లో మృతి చెందారు.అతని తల్లి బెజ్జారపు పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఖానాపూర్ ఎస్సై లింబాద్రి తెలిపారు.