సిరాన్యూస్, ఆదిలాబాద్
తపన ఉంటే లక్ష్యాన్ని సాధించవచ్చు
* ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క టాలెంట్
* డిసిసిబి డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి
* విష్ణు ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో గ్రూప్ 1, 2 పై అవగాహన
మనలో తపన ఉంటే ఎలాంటి లక్షన్నైనా సాధించవచ్చని డిసిసిబి డైరెక్టర్, డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హైదరాబాద్ కు చెందిన విష్ణు ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రూప్ 1, గ్రూప్ 2 అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఏఎస్ అకాడమిక్ చెందిన విష్ణు, పురుషోత్తం లు తమ అకాడమీ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను విద్యార్థులకు వివరించారు.ఈ మేరకు గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు మీడియం లో చదువుకున్న విద్యార్థులు ఉన్నత చదువులకు ఇంగ్లీష్ భాష ఇబ్బందులను కలిగిస్తుందనే భయాన్ని మొదట విడనాడాలన్నారు. మీడియం ఏదైనా మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనలో పట్టుదల ఉండాలని సూచించారు. ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుందని దాన్ని వెలికి తీసి ఉన్నత నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో బీసీ స్టడీస్ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, అధ్యాపకులు నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.