సిరాన్యూస్,ఉట్నూర్
క్రమశిక్షణతో ఆడి కప్ ను సాధించాలి
* ఆదిలాబాద్ జిల్లా ఓలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి
* 28న ఢిల్లీ లో జాతీయ స్థాయి ఖోఖో పోటీలు
జాతీయ స్థాయి ఖోఖో క్రీడా పోటీల్లో రాష్ట్ర జట్టులో పాల్గొంటున్న క్రీడాకారులు క్రమశిక్షణతో మంచి ప్రతిభను ప్రదర్శించి, కప్ ను సాధించాలని ఆదిలాబాద్ జిల్లా ఓలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి సూచించారు. డిల్లీ లో 28వ తేదీన జరిగే ఖోఖో పోటీల్లో పాల్గొనేందుకు ఉట్నూర్ లోని కొమురం భీం కాంప్లెకక్స్ లో సోమవారం ప్రారంభమైన శిక్షణ శిబిరానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ. మారుమూల ప్రాంతాల్లో ఖోఖో, కబడ్డీ క్రీడలు ఎక్కువగా అడుతారని తెలిపారు. 1980 జరిగిన జాతీయ స్థాయి క్రీడా పోటీలకు తాము సైతం ఉత్సహంగా గ్రౌండ్ ను సిద్ధం చేసామని గుర్తు చేశారు. ఇన్ఫస్ట్ స్ట్రక్చర్ ఉన్న లేకున్నా క్రమశిక్షణతో ఆడి ప్రతిభను కనబరచాలని సూచించారు. జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, ఏ.ఎస్.ఓ హేమంత్ కోచ్ శివకృష్ణ, ఆనంద్ కుమార్ , కార్తీ తదితరులు పాల్గొన్నారు.