సిరాన్యూస్, బోథ్
బహుజనుల కోసం జగ్జీవన్ రావ్ ఎంతో కృషి
అంబేద్కర్ సంఘం అధ్యక్షులు భగత్ ప్రవీణ్
బహుజనులను చైతన్యం చేయడంలో బాబు జగ్జీవన్ రావ్ ఎంతో కృషి చేశారని అంబేద్కర్ సంఘం అధ్యక్షులు భగత్ ప్రవీణ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల సొనాల బస్టాండ్ వద్ద బాబు జగ్జీవన్ రావ్ జయంతి అంబేద్కర్ సంఘ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా అంబేద్కర్ సంఘ భవనం నుండి బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం బస్టాండ్లో జగ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి కే లక్ష్మణ్, ఉపాధ్యక్షులు సంజయ్, మాజీ అధ్యక్షులు బత్తుల రమేష్, భీమ్రావు పాటిల్, మద్దెల మహేష్, పొన్న హరీష్ తోపాటు మాజీ ఎంపిటిసి లంక లలిత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాజుల పోతున్న, ప్రేమ్ రాజ్ అమృత రావు, అనిల్, సంఘపాల్, రాజారాం, దశరథ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు