Bhajarangdal: అవుల లారీని అడ్డుకున్న భజరంగ్ దళ్ కార్యకర్తలు

సిరా న్యూస్,నర్సాపురం;
తూర్పు గోదావరి జిల్లా నుంచి అవులతో చెన్నై వెళ్ళుతున్న లారీని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లో భజరంగ్ దళ్, ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు నిలిపారు.ఒకే లారీలో సుమారు 24 ఆవులు, దూడలను ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. సమాచారం అందుకున్నడీఎస్పీ గంటి శ్రీనివాసరావు అక్కడికి సిబ్బందితో చేరుకున్నారు. ఆవుల రవాణా అనుమతిపత్రాలను పరిశీలించారు. అనుమతి పత్రాలపై సంతకాలు ఉన్న అధికారులకు ఫోన్ చేసిమాట్లాడి అనుమతి ఉన్నట్లు నిర్ధారించారు. ఆవులకు నీరు తాగించి తీసుకువెళ్లాలనిభజరంగదళ్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సూచన మేరకు ఆ లారీని గోశాల వద్దకు తీసుకు వెళ్లారు.నరసాపురం డీఎస్పీ చొరవతో ఆవుల రవాణా వ్యవహారంలో ఏర్పడిన సమస్య పరిష్కారమైంది.
==

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *