సిరా న్యూస్,ఒంగోలు;
బాపట్ల జిల్లా చీరాల లో ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా దళిత సంఘాలు భారత్ బంద్ కు పిలుపు నిచ్చాయి. తెల్లవారుజాము నుండే బంద్ ప్రభావం మొదలైంది.
స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి బస్సులను అడ్డుకొని రోడ్డు పై బైఠాయించి ఆందోళనకు దిగారు.
దీనితో తాత్కాలికంగా ఆర్టీసీ సర్వీసులను నిలిపివేశారు. ఇప్పటికే పలు స్కూల్స్, కాలేజీలు, వ్యాపార సంస్థలు మూసివేసి బంద్ కు మద్దతు ప్రకటించారు.ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.