సిరా న్యూస్,హైదరాబాద్;
దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ లో భాగంగా సోమవారం మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా గౌడవెల్లిలో నిర్వహించిన సభలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డిజిటల్ స్క్రీన్ ద్వారా ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమములో గ్రామ సర్పంచ్ సురేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ, గౌడవెల్లి లాంటి గ్రామీణ ప్రాంత ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కెనరా బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్, పోస్టల్ సూపరింటెండెంట్ సంపత్ రెడ్డి, నాబార్డ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ రమేష్ కృష్ణ, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ శ్రీనివాస్, సీడీపీఒ ఉదయశ్రీ తదితరులు మాట్లాడుతూ, ఆయా శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. సభ ప్రాంగణములో ‘ఉజ్జ్వల’, ‘ఆధార్’, ‘ఆయుష్మాన్ భారత్’ స్టాళ్ళలను ఏర్పాటు చేసి అర్హులైన లబ్ధిదారులకు సేవలు అందించడమే గాక, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 2024 కాలెండర్తో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాల పై రూపొందిoచిన బుక్ లెట్ను, గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కు అందించిన సహాయంపై రూపొందిoచిన బ్రోచర్ను గ్రామ సర్పంచ్ శ్రీ సురేందర్ ఆవిష్కరించారు. డ్రోన్ ల ద్వారా ఎరువులు, క్రిమిసంహారకాలను చల్లడాన్ని ప్రదర్శించి చూపారు.