ప్రజా భవన్ లో భట్టి జన్మదిన వేడుకలు

 సిరా న్యూస్,హైదరాబాద్;
కొనసాగుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ప్రజాభవన్ లో ఘనంగా జరిగాయి. రాష్ట్ర నలుమూలల నుంచి ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు తరలివచ్చారు.అయన ముందుగా ప్రజాభవన్ లోని పోచమ్మ తల్లి దేవాలయం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదగిరిగుట్ట వేద పండితులు, హైదరాబాదులోని ప్రముఖ దేవాలయాల ఆలయ అర్చకులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆశీర్వదించారు. పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ గజమాలతో సత్కరించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో 50 కిలోల కేకు ను కట్ చేసారు. ప్రజాభవన్ పరిసర ప్రాంతాలు పార్టీ శ్రేణులు అభిమానుల రాకతో కిక్కిరిసింది. ప్రభుత్వ విప్ బర్లు అయిలయ్య, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నగేష్, ఐఏఎస్ అధికారులు హనుమంతరావు, సుశీల్ శర్మ,, అడిషనల్ డీజీ సునీల్ కుమార్, అసెంబ్లీ సెక్రటరీ నరసింహచార్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *