సిరాన్యూస్, భీమదేవరపల్లి
భీమదేవరపల్లిలో రైతుల సంబరాలు
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినా మాట ప్రకారం రైతు రుణమాఫీ మొదటి దశలో లక్ష రూపాయల నగదు రైతుల ఖాతాలో జమ చేసిన సందర్భంగా రైతులు సంబరాలు చేసుకున్నారు. గురువారం భీమదేవరపల్లి మండల కేంద్రంలోని మూలుకనూర్ అంబేత్కర్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలబిషేకం చేసి బాణసంచ ను కాల్చి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో రైతులు, మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు,నాయకులు మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.