Bhishmachari: ఇద్దరి అంధులకు చూపునిచ్చిన ముంచాల లక్ష్మి

సిరా న్యూస్, ఓదెల
ఇద్దరి అంధులకు చూపునిచ్చిన ముంచాల లక్ష్మి
ఓదెల నివాసి ముంజాల లక్ష్మి మృతి చెందగా ఆయన నేత్రాలను దానం చేస్తే, ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించవచ్చని సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు.అందుకు కుటుంబ సభ్యులు అంగీకరించగా ఎల్‌వీపీ గోదావరిఖని ఐ బ్యాంక్ టెక్నీషియన్ ఉపేందర్ ద్వారా నేత్రాలను సేకరించి , హైదరాబాద్ ఐ బ్యాంక్ కు పంపించారు. కుటుంబం దుఃఖంలో ఉండి కూడా మరో ఇద్దరు అంధులకు వెలుగులు ప్రసాదించుట కు ముందుకు కుమారులు మహేందర్ భార్య స్రవంతి,రాజు భార్య సోనీ కూతురు కోమల, శ్రీనివాస్ లకు సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు టి.శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి,రమేష్, రాజమౌళి పృత్విరాజ్ ,వాసు, సారంగం, డాక్టర్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు, డాక్టర్ వేణు, క్యాతం.మల్లేశం. క్యాతం వెంకటేశ్వర్లు రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షులు తానిపర్తి విజయలక్ష్మి, బంక కళావతి, కోశాధికారి మనీషా అగర్వాల్, ప్రతినిధి బెణిగోపాల్ త్రివేది అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *