Bhishmachari: నేత్రదాతకు సంస్మరణ సభ

సిరాన్యూస్, ఓదెల
నేత్రదాతకు సంస్మరణ సభ
* అవ‌యావ‌ల దానంపై అవ‌గాహ‌న
* సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి
ఓదెల‌కు చెందిన నేత్రదాత వెంకట సాయి సంస్మరణ సభను వారి నివాసంలో మంగ‌ళ‌వారం సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసంద‌ర్బంగా బంధు, మిత్రులకు నేత్ర, అవయవ, శరీర దానాలపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఓదెల మండలం ఎంఆర్వో యాకన్న కుటుంబ సభ్యులకు జ్ఞాపికను అంద‌జేశారు . అనంత‌రం సదాశయ ఫౌండేషన్ సభ్యులకు అభినందనలు తెలిపారు.అలాగే రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేందర్ మాట్లాడుతూ చేతికందిన కుమారుడు చనిపోయిన బాధలో ఉండి కూడా సమాజహితాన్ని కోరి నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు .మరో ఇద్దరు అంధులకు వెలుగులు ప్రసాదించుటకు ముందుకు వచ్చిన తల్లితండ్రులు ముద్దసాని సరిత, రమేష్ , పెద్దనాన్న ముద్దసాని కుమార స్వామి, రమ తమ్ముడు అజయ్ , అక్క బావ మౌనిక ,సతీష్ ల‌కు సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు టి.శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, ప్రతినిధులు రమేష్, రాజమౌళి, పృత్విరాజ్ , వాసు, ఎంపీటీసీ బోడకుంటి లక్ష్మి చిన స్వామి, క్యాతం మల్లేశం, డాక్టర్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు, డాక్టర్ దాసరి రాజన్న, అల్లం సతీష్, బి. సంతోష్ గౌడ్ అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *