సిరాన్యూస్, సైదాపూర్
బూడిదపల్లిలో గౌడ కులస్తుల పోచమ్మ బోనాలు
సైదాపూర్ మండలం బూడిదపల్లి గ్రామంలో మంగళవారం గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు. ఉగాది పండుగ పర్వదినం పురస్కరించుకొని గ్రామ మహిళలలు , శివసత్తులు, డప్పుచప్పుళ్ళు, నృత్యాలతో వెళ్ళి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనంకుండ, కల్లు నైవేద్య ప్రసాదాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు యువత పాల్గొన్నారు.