సిరాన్యూస్,ఖానాపూర్
బాధితులను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు జాన్సన్ నాయక్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్వచింతల్ గ్రామానికి చెందిన కొండ్ర అశోక్ అనారోగ్య రీత్యా నిర్మల్ పట్టణంలోని స్వప్న హాస్పిటల్ లో చికిత్సపొందుతున్నాడు. అలాగే మస్కాపూర్ గ్రామానికి చెందిన చిలుకూరి రాజలింగు కుమార్తె చిలుకూరి అక్షిత దేవేందర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇరువురిని గురువారం బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ పరామర్శించారు. వారి ఆరోగ్య స్థితి గతులను అడిగి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. వారి వెంట నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.