సిరాన్యూస్, ఉట్నూర్
అక్బర్ కుటుంబాన్ని పరామర్శించిన నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల ప్రముఖ పాత్రికేయులు అక్బర్ సతీమణి అనారోగ్యంతో ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ బుధవారం ఉట్నూర్ పట్టణం లో వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకొని వారికి మనోధైర్యం కల్పించారు. వారి వెంట నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.