ఏసీబీవలలో భువనగిరి ఆర్టీవో

సిరా న్యూస్,యాదాద్రి;
యాదాద్రి భువనగిరి జిల్లా, రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. జిల్లా రవాణా శాఖ అధికారి సురేందర్ రెడ్డి.. ఏసీబీ కి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. పోచంపల్లి మండలం, కప్పరాయిపెల్లి కి చెందిన ప్రవీణ్.. నేషనల్ పర్మిట్ క్యాన్సిలేషన్ కోసం వెళ్లగా.. ఆర్టిఏ కార్యాలయంలోని ఓ బ్రోకర్ 10000 రూపాయలు డిమాండ్ చేశారు. నేరుగా జిల్లా అధికారి అడిగినట్లు తెలపడంతో.. పని జరిగిన తర్వాత డబ్బులు ఇస్తానని తెలిపారు. నల్లగొండలోని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా.. మరోసారి ప్రవీణ్ ఏజెంట్ను కలవగా 5000 రూపాయలు ఇవ్వండి పనిచేయిస్తానని తెలపడంతో ఏసీబీ అధికారులతో కలిసి నేడు క్యాన్సిలేషన్ సర్టిఫికెట్ తీసుకునే క్రమంలో ఏజెంట్ అనిల్ కు ఇస్తుండగా ఏసీబీ B అధికారులు నేరుగా పట్టుకున్నారు. ఏజెంట్ అనిల్ తో పాటు.. జిల్లా రవాణశాఖ అధికారి సహా మరో ఇద్దరు ఏజెంట్లపై కేసు నమోదు చేయడం జరిగిందని ఏసీబీ డిఎస్పి శ్రీనివాసరావు తెలిపారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *