సిరా న్యూస్,అనంతపురం;
కదిరి, ఎర్రదొడ్డి, హరీష్ రెసిడెన్షియల్ విద్యార్థులతో నారా భువనేశ్వరి మాటమంతి జరిపారు. విద్యార్దులు భువనేశ్వరిని తమ స్కూల్ కి రావాలని ఆహ్వానించారు. స్కూల్ లో ఉన్న సరస్వతి ఆలయాన్ని ఆమె సందర్శించారు. ప్రత్యేక పూజలు చేసి, అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి దిశానిర్దేశం చేసారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుని దేశానికి, రాష్ట్రానికి మంచి చేయాలని విద్యార్థులను సూచించారు. టెక్నాలజీ ని వాడి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిగమించాలని, టెక్నాలజీ ని దుర్వినియోగం చేయకూడదని సూచించారు. విద్యార్థి దశ నుండే సంస్కృతి, సాంప్రదాయలను అలవాటు చేసుకోవాలని తెలిసారు. గురువులు దేవుళ్ళతో సమానమని, వారిని గౌరవించాలని విద్యార్థులకు వివరించారు. హరీష్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు భువనేశ్వరికి గాయత్రి శ్లోకాన్ని పాడి వినిపించారు.