స్పీడు పెంచిన సైకిల్
కరెంటు కోతలతో ఫ్యాన్ విలవిలా
సిరా న్యూస్,ఎమ్మిగనూరు;
ఎమ్మిగనూరు మండలంలోని మసీదుపురం గ్రామానికి చెందిన వైసిపి పార్టీ కురువ, బోయ, వడ్డే, వడ్ల, ముస్లిం కమ్యూనిటీ సభ్యులు తిమ్మప్ప, బ్రహ్మయ్య, తిరుమల, ఈరన్న, దస్తగిరి, మాబు, ఉరుకుందు, నరసింహుడు, చిన్న పెద్దయ్య మరియు వారి అనుచరులు సుమారు 100 కుటుంబాలు వైసిపి పార్టీని వీడి ఎమ్మిగనూరు మండల టిడిపి కమిటీ సభ్యులు, మరియు మసీదుపురం గ్రామ టిడిపి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ ఉమ్మడి టిడిపి అభ్యర్థి గౌ శ్రీ డా బి జయనాగేశ్వర రెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి పార్టీలో కస్టపడి పనిచేసే వారికి సముచిత స్థానం లేదని, వైసిపి పార్టీ తుగ్లక్ నిర్ణయాల వల్ల విసిగి వేసారి టిడిపి పార్టీలోకి చేరుతున్నట్లు వారు ప్రకటించారు
=========================