సిరా న్యూస్,నంద్యాల;
నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ రేంజ్ పరిధిలోని ముసలిమడుగు బీట్ లో వేటగాళ్ల ఉచ్చులో పెద్దపులి పడింది. ఉచ్చును పెకిలించి ఉచ్చుతో సహా అడవిలో తిరుగుతుండగా గత నెల 25వ తేదీన ట్రాప్ కెమెరాల్లో ఫారెస్ట్ అధికారులు గమనించారు. గత పది రోజుల నుంచి మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఫారెస్ట్ అధికారులు దాదాపు 50 మంది సిబ్బందితో కలిసి రిస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. మంగళవారం తెల్లవారుజామున పులికి మత్తుమందు ఇచ్చి బంధించి ఉచ్చును తొలగించారు. ఉచ్చు లో పడ్డ పులి ఆడపులి అని 3సంవత్సరాల వయస్సు ఉంటుందని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బైర్లుటి బేస్ క్యాంపులోని వెటర్నరీ వైద్యుల సమక్షంలో పెద్ద పులి కి చికిత్స అందిస్తున్నారు. చికిత్స అనంతరం పెద్దపులిని తిరుపతికి తరలించే యోచనలో అడవి శాఖ అధికారులు వున్నారు.