సిరాన్యూస్,సైదాపూర్:
అందుబాటులో జిలుగు విత్తనాలు : సొసైటీ చైర్మన్ బిల్లా వెంకట్ రెడ్డి
సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం లో జిలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వెన్నంపల్లి గ్రామ సొసైటీ చైర్మన్ బిల్లా వెంకట్ రెడ్డి, సీఈఓ సిహెచ్. మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిలుగు 30కేజీ 1120, బీపీటీ 5204 25కేజీ 950, ఎంటీయూ 1010 30కేజీ 1020, గోదావరి డీఏపీ 1350 ధరలలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.జిలుగు విత్తనాలు కావలసిన రైతులు వారి యొక్క భూమి పాస్ బుక్ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ వెంట తీసుకునిరాగలరని కోరారు.