సిరా న్యూస్,సైదాపూర్:
రైతుల సమస్యల పరిష్కారానికి కృషి: సింగిల్ వీండో చైర్మన్ బిల్లా వెంకట్ రెడ్డి
* వెన్నంపల్లిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం
సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామ పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గురువారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెన్నంపల్లి సింగిల్విండో చైర్మన్ బిల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా అంశంపై అత్యవసర సమావేశానికి రైతులందరూ హాజరైనందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. రైతుల అభిప్రాయా లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా కృషి చేస్తామని బిల్లా వెంక రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రజిత, ఏఓ వైదేహి, ఆడిటర్ శ్రీనివాస్, మాజీ సింగిల్ విండో చైర్మన్ సారబుడ్ల రాజిరెడ్డి, సీఈఓ మల్లారెడ్డి, సుశీల, మహేష్, భాస్కర్ రెడ్డి, సంఘం డైరెక్టర్లు, రైతులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.