సిరా న్యూస్,సంగారెడ్డి;
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ లో శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి ఆలయం శివరాత్రి ఉత్సవాలకు ఘనంగా ముస్తాబయింది. , ఈ ఆలయానికి ప్రతి ఏటా శివరాత్రి ఉత్సవాలకు సుమారు 6, 7 లక్షల మంది భక్తులు హాజరవుతుంటారని ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని, వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండ వివిధ ప్రాంతాల నుండి రవాణా సౌకర్యం, బోజన వసతి, మెడికల్ క్యాంపులు, చలవ పందిల్లు, మరుగుదొడ్లు, నీటి వసతుల వంటి సౌకర్యాలు ఆలయ ఈవో శశిధర్ రెడ్డి ఏర్పాటు చేస్తున్నారు.
ఈ ఆలయం 6వ శతాబ్దంలో భృగు మహర్షి తన తపస్సు శక్తినంత ధారబోసి ఈ ఆలయం నిర్మించబడిందని, శ్రీశైలం మహా క్షేత్రాన్ని సందర్శించ స్తోమత లేని భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేసుకొని అంతటి అనుభూతిని పొందువచ్చని, ఇక్కడి నుండి శ్రీశైలం క్షేత్రానికి ఒక సొరంగ మార్గం కూడా ఉన్నట్టు ఆనవాలు ఉన్నాయని ఆలయ ప్రధాన అర్చకులు ప్రహ్లాదశర్మ తెలిపారు.