biyyala Mallesh: ఆత్రం సక్కును భారీ మెజార్టీతో గెలిపించాలి : మండల అధ్యక్షుడు బియ్యాల మల్లేష్

సిరాన్యూస్,సిరికొండ
ఆత్రం సక్కును భారీ మెజార్టీతో గెలిపించాలి : మండల అధ్యక్షుడు బియ్యాల మల్లేష్

ఆదిలాబాద్ బీఆర్ ఎస్ ఎంపీ అభ్య‌ర్థి ఆత్రం సక్కును భారీ మెజార్టీతో గెలిపించాల‌ని సిరికొండ బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బియ్యాల మల్లేష్ అన్నారు. శ‌నివారం ఆదిలాబాద్ జిల్లా సిరికొండ సిరికొండ మండల కేంద్రంలో ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమలు చేశారో సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ కు ఓటు వేసి ఆత్రం సక్కును భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఒరగంటి పెంటన్న, మాజీ ఉపసర్పంచ్ తోకల చందు, ఎక్బాల్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *