ఖానాపూర్, సిరా న్యూస్
బీజేపీ ఆధ్వర్యంలో చలో బస్తీ చలో
బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గావ్ చలో బస్తీ చలో పల్లెకు పోదాం కార్యక్రమాన్ని ఖానాపూర్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు నాయిని సంతోష్ అధ్యక్షతన వర్క్ షాప్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ కలిగిరి మల్లిఖార్జున్ హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో బూత్ స్థాయిలో పార్టీని పటిష్టం చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ నల్ల రవీందర్ రెడ్డి, ఖానాపూర్ పట్టణ కన్వీనర్ ప్రొద్దుటూరు గోపాల్ రెడ్డి, కో కన్వీనర్ ఎలిగేటి వెంకటేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి దాసరి శ్రీనివాస్, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షులు బొప్పరపు సత్యవతి, సీనియర్ నాయకులు బూత్ అధ్యక్షులు బూత్ ప్రవాస్, కార్యకర్తలు నిమ్మగడ్డ రవీందర్, తోకల బుచ్చన్న యాదవ్, మైలారపు గంగాధర్, దుర్గం పరమేష్ గౌడ్, లక్కవత్తుల రాజేశ్వర్, రుస్తుం బలేటి గంగారాం, కంతి లింబాద్రి, అయినవేని సాయి కొండవీని రమేష్, దాని పెళ్లి సుధాకర్, జీవన్ సెట్ అన్నపెన్న రాజశేఖర్, ఎడ్ల సాయి పాల్గొన్నారు