సిరాన్యూస్,హుజురాబాద్
బండి సంజయ్ గెలుపే ధ్యేయంగా పనిచేయాలి
బండి సంజయ్ కుమార్ గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని బీజేపీ నాయకులు అన్నారు. హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామంలో మంగళవారం 20వ బూత్ సభ్యులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. దేశంలో మోడీ కరీంనగర్ లో బండి సంజయ్ కుమార్ ఉంటేనే అభివృద్ధి ఉంటుందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బండి సంజయ్ కుమార్ గెలిపించవలసిందిగా కోరారు. కార్యక్రమంలో బాణాల రఘుపతిరెడ్డి,బొక్కల శ్రీనివాస్ రెడ్డి,నర్రా శ్రీనివాస్ రెడ్డి, కూతాడి శ్రీకాంత్, మహిపాల్ రెడ్డి, బొద్దుల కృష్ణ,పెండ్యాల తిరుపతి రెడ్డి,ఎండీ హైమాద్, గోనె అరుణ్, కూతాడి అరుణ్, చంద్రారెడ్డి,బాణాల జనార్ధన్ రెడ్డి, గరుదాసు మణికంఠ, గ్రామస్థులు పాల్గొన్నారు.