ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బీజేపీ,బిఆర్ఎస్ చీకటి ఒప్పందం

–బిఆర్ఎస్ కు పదేళ్లు అధికారం ఇస్తే ప్రజలకు ఒరగబెట్టింది ఏమిలేదు

–వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గెలుపు తధ్యం

–కాంగ్రెస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి భర్ల సహదేవ్

–నూతనంగా నియామకమైన సహదేవ్ కు ఘన సన్మానం

సిరా న్యూస్,వర్దన్నపేట;

లోకసభ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బీజేపీ,బిఆర్ఎస్ పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయని కాంగ్రెస్ పార్టీ వర్దన్నపేట నియోజకవర్గ అధికార ప్రతినిధి భర్ల సహదేవ్ అన్నారు.గురువారం వర్దన్నపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సహదేవ్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీకి పదేళ్లు అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలకు ఒరగబెట్టింది ఏమిలేదని కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే పదేళ్లలో లబ్ది పొంది,ప్రజా ధనాన్ని దోచుకుందని ఆరోపణలు గుప్పించారు.పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో కేసీఆర్ పూర్తిగా అవినీతి,అక్రమాలకు పాల్పడి ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని అన్నారు. కేసీఆర్,కేటీఆర్,హరీష్ రావులు అధికారం కోల్పోగానే మతిభ్రమించి మాట్లాడుతూ వంద రోజుల కాంగ్రెస్ ప్రజా పాలనపై ఆరోపణలు చేయడం వారి అధికార దాహానికి నిదర్శనం అన్నారు.వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గెలుపు కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిలా పని చేసి కాంగ్రెస్ ప్రజా పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును ప్రతి గడపకు చేరవేయాలని కోరారు.పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గెలుపు ఖాయం అని ఆశాభావం వ్యక్తం చేశారు.అదేవిదంగా శనివారం తుక్కుగూడలో నిర్వహించే కాంగ్రెస్ జన జాతర సభకు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివెళ్లాలని పిలుపునిచ్చారు. నూతనంగా కాంగ్రెస్ పార్టీ వర్దన్నపేట నియోజకవర్గ అధికార ప్రతినిధిగా తనకు బాధ్యతలు అప్పగించడం పట్ల సంతోషం వ్యక్తపరుస్తూ,తన నియామకానికి సహకరించిన శాసనసభ్యులు కేఆర్ నాగరాజు,కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ వరద రాజేశ్వర్ రావు లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అంతకుముందు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహదేవ్ ను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సమ్మెట సుదీర్ గౌడ్,సీనియర్ నాయకులు మహ్మద్ అఫ్సర్,చిదురాల కుమారస్వామి,సమ్మెట రాంబాబు గౌడ్,కొండేటి బాలకృష్ణ,మల్లెపాక సమ్మయ్య,శివరాత్రి ఎల్లస్వామి,చెరుపెల్లి బాబు, షబ్బీర్,చంద్రమౌళి, చింత బాబు,బొక్కల భాస్కర్, బొంత స్వామి,బొంత వెంకన్న,ఉప్పునూతుల యాకయ్య,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *