సిరా న్యూస్,వికారాబాద్;
వికారాబాద్ జిల్లా నవపేట్ మండల వట్టి మదనపల్లి నుండి నవపేట్ వరకు బీజేపీ ఎంపి అభ్యర్ది కొండ విశ్వేశ్వర్ రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్ షో నిర్వహించారు రోడ్ షోలో వేలాది సంఖ్యలో ప్రజలు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ మండలానికి వెళ్లిన ఏ నియోజకవర్గానికి వెళ్ళిన ప్రజలందరూ బిజెపి పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని కొండ విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలందరూ బిజెపి పార్టీ వైపు చేస్తున్నారని దీనికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ వేవ్ దేశంలోను తెలంగాణలో కూడా నడుస్తుందని తెలిపారు. దీనికి నిదర్శనం ప్రజల ఆదరణలే కారణమని వారు తెలిపారు. మేము పెట్టిన ప్రజాసంకల్పయాత్ర అది పూర్తిగా చేరికల యాత్రగా సాగుతుందని వారు అన్నారు. ఈ ఎన్నికల్లో రెండు లక్షల మెజారిటీతో గెలుపొందడం ఖాయమని దీమ వ్యక్తం చేశారు. దేశంలో మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావడం ఖాయమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలను ఎన్ని ప్రలోభాలు పెట్టిన ప్రజలు నమ్మబోరని బిజెపినీ గెలిపించడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కె ఎస్ రత్న,నవపేట్ బీజేపీ మండల అధ్యక్షులు నరేందర్ రెడ్డి వివిధ గ్రామాల అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
============