సిరా న్యూస్, ఆదిలాబాద్:
మోడీని కలిసిన దళిత మోర్చ నాయకులు
బిజెపి పార్టీ ఆదిలాబాద్ జిల్లా దళిత మోర్చ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. విజయ సంకల్ప సభలో భాగంగా ఆదిలాబాద్ పట్టణానికి విచ్చేసిన నరేంద్ర మోడీని ఈ మేరకు కలిసి స్వాగతం పలికారు. దళిత మోర్చా ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు అస్తక్ సుభాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి తాక్సాండే దర్మపాల్ మోడీకి నమస్కరించి తమను తాము పరిచయం చేసుకున్నారు.