సిరా న్యూస్,హైదరాబాద్;
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పైన బిజెపి కసరత్తు ప్రారంభించిందా? ఆశావాహులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారా? అభ్యర్థి ఎవరైతే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయో బిజెపి లెక్కలు వేస్తుందా? గతంలో నాలుగో స్థానంలో ఉన్న బిజెపి ఈసారి గెలవడానికి ఎలాంటి ప్రణాళికన రూపొందిస్తుంది? పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది? వాచ్ దిస్ స్టోరీ.పట్టభద్రుల నియోజక వర్గం ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల అయింది.. కమలం పార్టీ నుండి అభ్యర్థి ఎవరు అనే చర్చ జరుగుతుంది… గ్రాడ్యుయేట్ లో బీజేపీ పట్టు ఉందనే ఉద్దేశ్యం తో పలువురు బీజేపీ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచారం ….
వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజక వర్గ ఉప ఎన్నికకు షెడ్యూల్ వచ్చింది…. మే 27 న ఎన్నిక జరగనుంది… పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే గా ఎన్నికైన తరవాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం తో ఉప ఎన్నిక వచ్చింది .. ప్రధానంగా మూడు పార్టీలు ఈ సీటు ను కైవసం చేసుకునేందుకు ప్రయత్నం చేసుకుంటున్నాయి… కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థి నీ ప్రకటించింది… కమలం పార్టీ నుండి అభ్యర్థి ఎవరు అనే చర్చ జరుగుతోంది…గత ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమెందర్ రెడ్డి పోటీ చేశారు…. బీజేపీ నాలుగో స్థానం లో నిలిచింది… ఈ సారి చాలా మందే పోటీ పడుతున్నారు… వాతావరణం బాగుందని భావిస్తున్నారు ఆశావహులు….గత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రేమేందర్ రెడ్డి ఈ సారి కూడా తనకే టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారని తెలుస్తుంది… మరో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు కూడా టికెట్ ఆశిస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతుంది… టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారనీ పార్టీ వర్గాలు అంటున్నాయి… ఇక మరో బిజెపి సీనియర్ నేత రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి కూడా టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు…. పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమంలో విసృతంగా పాల్గొన్నారు…ఓటర్ల నమోదు ను కూడా స్వయంగా చెపించుకున్నారు… వీరితో పాటుగా పార్టీ ఆదేశిస్తే పోటీ చేయడానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి సిద్ధమంటుందట… ముఖ్యంగా గత గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈమె పోటీ చేశారు కూడా…కాబట్టి ఆ నియోజకవర్గాల్లో విస్తృతంగా ఓటర్లను కలిసినందున… ఈసారి పార్టీ ఆదేశిస్తే తాను కూడా పోటీ చేస్తానని తన సన్నిహితులతో రాణి రుద్రమదేవి చెప్పినట్లు సమాచారం…వీరితో పాటుగా స్థానిక నేతలు కూడా ఆశపడుతున్నరని తెలుస్తుంది…బీజేపీ నేతలే కాదు ఒకరిద్దరు విద్యా వేత్తలు కూడా సీటు అడుగుతున్నారని తెలుస్తుంది… విద్యా సంస్థల అధినేత ఎవియన్ రెడ్డి పార్టీ లో చేరి టీచర్ ఎమ్మెల్సీ గా పోటీ చేసి గెలవడం తో వరంగల్ కు చెందిన విద్యా సంస్థల అధినేత లు కన్నేసినట్లు ప్రచారం జరుగుతుంది….ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించి కథనరంగంలోకి దిగగా… ఇక బిజెపి కూడా అభ్యర్థి అన్వేషణలో పడింది… బలమైన అభ్యర్థి కోసం పార్టీ కసరత్తులు చేస్తుంది.. టికెట్ ఆశిస్తున్న నేతలకు పార్టీ జై కొడుతుందా లేక కొత్తగా ఎవరినైనా బిజెపి తెరమీదకి తీసుకొస్తుంది వేచి చూడవలసిందే.
=================