మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్
సిరా న్యూస్,హైదరాబాద్;
భాజపా లో శివాజీ,రానా ప్రతాప్ లాంటి నాయకుడు ప్రదని మోడీ అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ పర్యటనలో వున్న అయన మీడియాతో మాట్లడారు.భాజపా సిద్దంతలపై నడిచే పార్టీ..సనాతన ధర్మం కాపాడుకోవాలి
బూత్ స్థాయి నుండి భాజపా ను మరింత పటిష్టం చెయ్యాలి..భాజపా విజయానికి అందరూ కష్టపడి పని చేయాలి. దేశాన్ని పాలించే సమర్థవంతమైన నాయకుడు ప్రధాని మోడీ. 👉కాంగ్రెస్ మతకల్లోలను సృష్టించింది కాంగ్రెస్. హిందూ ముస్లిం ల మధ్య గొడవలను కాంగ్రెస్ సృష్టించింది. భాజపా రాజనీతి కుర్చీ కోసం కాదు దేశ ప్రజల బాగోగుల కోసమని అన్నారు.
చాయ్ అమ్మే వ్యక్తిని ప్రధాని చేసిన ఘనత,సాధారణ వ్యక్తిని తనను ముఖ్యమంత్రి నీ చేసిన ఘనత దేశ ప్రజలది. భాజపా కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించదు. అయోధ్య లో రామ మందిరం,అరబ్ దేశాల్లో హిందూ దేవాలయాల వైభవం మోడి వల్లే సాధ్యం అయింది. ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళల కు న్యాయం చేసింది మోడీ ప్రభుత్వం. వికసిత భారత్ అనే నినాదంతో ఈ సారి మోడీ ప్రపంచంలోనే గొప్ప దేశంగా భారత్ ను నిర్మించనున్నారని అన్నారు.