దేశ శ్రేయస్సు కొరకు స్థాపించిన పార్టీ బీజేపీ పార్టీ

-భారత దేశాన్ని ప్రపంచం లో అగ్రగామిగా చేయడమే బీజేపీ లక్ష్యం
-ఘనంగా బిజెపి 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
-బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి
 సిరా న్యూస్,మంథని;
దేశ శ్రేయస్సు కొరకు స్థాపించిన పార్టీ బీజేపీ పార్టీ అని,భారత దేశాన్ని ప్రపంచం లో అగ్రగామిగా చేయడమే బీజేపీ లక్ష్యమని
బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి అన్నారు.
భారతీయ జనతా పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా మంథని పట్టణంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిధిగా జిల్లా అధ్యక్షులు సునీల్ రెడ్డి పాల్గొన్నారు, అనంతరం బీజేపీ కార్యాలయం లో పార్టీ జెండా ఆవిష్కరణ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
దేశం కోసం, ధర్మం కోసం పుట్టిన పార్టీ బీజేపీ అని, దేశం లో 2 సీట్ల నుండి 303 సీట్ల తో ఎదిగి మూడోసారి ఘన విజయం సాధించనుందని అన్నారు.ఎలాంటి అవినీతి, అక్రమలు లేని ఒకే ఒక పార్టీ బీజేపీ యేనన్నారు. దేశ అభివృద్ధి, ప్రగతి కొరకు మళ్ళీ ప్రజలు బీజేపీ అవకాశం ఇస్తారని ఎందరో త్యాగ జనుల పోరాట ఫలితం బీజేపీ పార్టీ అని అన్నారు.
ఈకార్యక్రమంలో బీజేపీ నాయకులు కొండపాక సత్య ప్రకాష్,సబ్బని సంతోష్, నాంపల్లి రమేష్, బోగోజు శ్రీనివాస్, చిలువేరు సతీష్ లతో పాటు కార్యకర్తలు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.
====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *