మూడవ సారి బీజేపీదే అధికారం

సిరా న్యూస్,సికింద్రాబాద్;
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి మూడోసారి అధికారంలోకి రావడమే కాకుండా,తెలంగాణ లోను అన్ని పార్లమెంట్ సీట్లు గెలుస్తామని రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి టీ.వీరేందర్ గౌడ్, మేడ్చల్ జిల్లా బిజెపి అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ప్రజలలోకి విస్తృతంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకు వెళ్ళడం ద్వారా మోడీ మరొక్క పర్యాయం ప్రధాని కావాల్సిన ఆవశ్యకతను వివరించడం కోసమే బిజెపి విజయ సంకల్ప యాత్ర అని బోయిన్ పల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడుతూ తెలిపారు.(భాగ్యలక్ష్మి క్లస్టర్) మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోకి ఈనెల 24 వ తేది న బస్ యాత్ర ప్రవేశిస్తున్నట్లు పేర్కొన్నారు.. అసెంబ్లీ వారీగా వివరాలను వెల్లడించారు. ఈ బస్సు యాత్ర లో బిజెపి నాయకులు, నరేంద్ర మోడీ గారి అభిమానులు భారీ ఎత్తున పాల్గొంటారని చెప్పారు…అలాగే బి ఆర్ ఎస్ పార్టీతో బిజెపి పొత్తు పెట్టుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *