సిరాన్యూస్, నాంపల్లి
రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలి : బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కసాల వెంకట్ రెడ్డి
రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కసాల వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని రైతు వేదిక పలు గ్రామాల బాధిత రైతులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి 2 లక్షల రూపాయలు రుణమాఫీ అమలు చేయాలని కోరారు.రైతులను ఇబ్బందులకు గురి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు చేయకపోతే భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలని రైతులకు తెలిపారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చ జిల్లా కార్యదర్శి బోంతు వెంకటయ్య, రైతులు పాల్గొన్నారు.