అమ్మ పేరిట మొక్కలను నాటిన బిజెపి నాయకులు

సిరా న్యూస్,మంథని ప్రతినిధి;

భారతీయ జనతా పార్టీ మంథని పట్టణ శాఖ ఆధ్వర్యంలో మంథని పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో ఏక్ పెడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా బిజెపి నాయకులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించాలన్న, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకోవాలన్న మనం పిలుస్తున్న గాలిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచాలన్న సకాలంలో వర్షాలు కురియాలన్నా చెట్లే మనకు ఆధారమని అవి లేకుంటే మనిషి మనుగడే లేదని అన్నారు. ప్రతి ఒక్కరూ అమ్మ పేరిట ఒక మొక్కను నాటాలనే సదుద్దేశంతో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. భారతీయ జనతా పార్టీ మంథని పట్టణ అధ్యక్షుడు సబ్బాని సంతోష్, పట్టణ కన్వీనర్ సామల అశోక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ నాంపల్లి రమేష్, సీనియర్ నాయకులు కొండపాక సత్య ప్రకాష్, బోగోజు శ్రీనివాస్, చిలువేరి సతీష్, బొల్లంపల్లి లక్ష్మణ్, దాసరి శ్రవణ్, ఎడ్ల సాగర్, దూడపాక రోజా, గుర్రాల రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *