సిరాన్యూస్, ఆదిలాబాద్
మరాఠ యోధుడు ఛత్రపతి శివాజీ
* బిజెపి జిల్లా అధికార ప్రతినిధి లోకా ప్రవీణ్ రెడ్డి
* శివాజీ జయంతి రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించాలి
మరాఠ యోధుడు ఛత్రపతి శివాజీ అని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి లోకా ప్రవీణ్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్లో ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేశారు .ఈ సందర్భంగా లోక ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ దేశభక్తికి, దైవభక్తికి, ధీరత్వానికి, ధైర్యసహసాలకు మారుపేరుగా నిలుస్తూ ప్రజా సంక్షేమం కోసం ఎన్నో యుద్ధాలు చేసి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎందరో మంది శత్రువులను తుదా ముట్టించినా మరాఠ యోధుడు ఛత్రపతి శివాజీ అని కొనియాడారు. దేశంలోనే కాకుండా, ప్రపంచంలోనే చత్రపతి శివాజీకి మహోన్నత గుర్తింపు ఉందని అన్నారు. ఆనాడు దేశంలోని అనేకమంది ప్రజలు పడుతున్న ఇబ్బందులతో అనేక రాజరిక వ్యవస్థలను మార్చాలని శివాజీ చిన్నతనం నుంచి పోరాటాలకు రూపుదిట్టారన్నారు. ఇలాంటి గొప్ప యోధుడు చత్రపతి శివాజీ జయంతిని ప్రభుత్వం సెలవుగా ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. వచ్చే ఏడాదైన ఛత్రపతి శివాజీ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారం గా నిర్వహించడంతో పాటు శివాజీ జయంతి రోజున ప్రభుత్వ సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ యువ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.