బీజేపీ మహిళా మోర్చా అందోళన

సిరా న్యూస్,హైదరాబాద్;
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షాజహాన్ షేక్, అతని అనుచరుల చేతిలో లైంగిక వేధింపులు, చిత్ర హింసలకు గురైన మహిళలకు మద్దతుగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు బిజెపి మహిళ మోర్చా ఆందోళనకు దిగింది. అతనిపై చర్యలు తీసుకోవాలని అతన్ని వెంటనే అరెస్టు చేయాలని మహిళ మోర్ఛా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్ప రెడ్డి డిమాండ్ చేసారు. సందేశ్ఖాలీ ప్రాంతంలో షాజహాన్ షేక్ అన్యాయాలు, లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా.. స్థానిక గిరిజనుల భూముల్ని స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మహిళ ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ మహిళలకు న్యాయం జరగడం లేదు. మమత బెనర్జీ ఇప్పటివరకు ఈ అంశంపై మాట్లాడకపోవడం దారుణం. వెంటనే షాజహాన్ షేక్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ దిష్టి బొమ్మ దహనానికి మహిళ మోర్చా నాయకులు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *