సిరాన్యూస్,ఆదిలాబాద్
గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి : బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు మరప రాజు
* జేసీకి వినతి పత్రం అందజేత
గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు మరప రాజు అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జేసీకి వినతి పత్రం అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్ల ట్రైబల్ డిక్లరేషన్ అని హామీ ఇచ్చి బడ్జెట్లో గిరిజనులకు ఇచ్చింది గాడిద గుడ్డు అన్నారు. గిరిజన గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఏటా 25కోట్ల హామీ ఐటీడీఏ కేంద్రాల నిర్మాణం, విధ్యాజ్యోతి పథకం విద్యార్థులకు 10వేల నుండి 5 లక్షల రూపాయల హామీ ఏమైందని ప్రశ్నించారు. కార్యక్రమంలో నాయకులు దవాలత్, గెడం శివ, అవినాష్, రాజు రవి అన్నారు.