BJP Paidipelli Prithviraj Goud: వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్:బీజేపీ మండ‌ల అధ్య‌క్షులు పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్

సిరాన్యూస్‌, భీమదేవరపల్లి
వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్:బీజేపీ మండ‌ల అధ్య‌క్షులు పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్

వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ అని బీజేపీ మండ‌ల అధ్య‌క్షులు పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ అన్నారు. మంగ‌ళ‌వారం భీమదేవరపల్లి మండ‌ల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.నరేంద్ర మోడీ ప్రభుత్వం వికసిత భారత్ లక్ష్యంగా పనిచేస్తుందని, దానికి అనుగుణంగా మంగ‌ళ‌వారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా కేంద్ర బడ్జెట్ రూపొందించారని కితాబిచ్చారు. మహిళా సాధికారత దిశగా మహిళలను ప్రోత్సహించడం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపారని, బడ్జెట్ లో మహిళలకు అత్యధిక నిధులు కేటాయించడం దానికి నిదర్శనమని అన్నారు. ఈ బడ్జెట్ ను దేశ ప్రజలు సంతోషంగా స్వాగతిస్తున్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *