సిరాన్యూస్,ఆదిలాబాద్
సీఎం దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ నాయకులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో దళితులకు తీవ్రంగా అన్యాయం చేసిందని బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సుభాష్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని ఖండిస్తూ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. డిక్లరేషన్ పేర్లతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మాట తప్పిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో దళిత మోర్చా నాయకులు ధరంపాల్, మల్లు, కిరణ్, దయాకర్, శ్రీనివాస్, కిషోర్, రాజు ప్రమోద్. తదితరులున్నారు.