సిరాన్యూస్, బోథ్
ఎస్సై ప్రవీణ్ను సన్మానించిన బీజేవైఎం నాయకులు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలానికి నూతనంగా వచ్చిన ఎస్సై ప్రవీణ్ను మంగళవారం బీజేవైఎం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎస్సైను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీజేవైఎం ప్రధానకార్యదర్శి మానాల శేఖర్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి రంజిత్ సింగ్, బీజేవైఎం మండల అధ్యక్షులు గొర్ల కార్తీక్, బీజేవైఎం మండల ప్రధానకార్యదర్శి సుందర్ సింగ్, బీజేవైఎం నాయకులు రోహిత్, సురేందర్, విశాల్, మంజయ్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.