సిరా న్యూస్,హిందూపురం;
నూతనంగా ఏర్పడనున్న కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కించుకోవడానికి హిందూపురం పార్లమెంట్ సభ్యుడు బి.కె పార్థసారధి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు , ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీలలో చూసుకుంటే బికే పార్థసారధికి రాజకీయ అనుభవం లో మొదటి స్థానం అని చెప్పవచ్చు 1996 లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన బీకే పార్థసారథి మొట్టమొదటిగా అనంతపురం జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ గా నియమితులయ్యారు 1999లో మొట్టమొదటిసారి గా హిందూపురం పార్లమెంటు నుంచి పోటీ చేసి విజయం సాధించారు అలాగే 2004లో సైతం ఎంపీగా విజయం సాధించారు , తర్వాత 2009,2014 లో పెనుకొండ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన పార్థసారథి 2019 ఎన్నికల్లో ఓటమి చెందారు, 2024 ఎన్నికల్లో మరోసారి హిందూపురం పార్లమెంట్ నుంచి పోటీ చేసి 1,32,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు , ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాల బట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలకము కానుంది కనుక తెలుగుదేశం పార్టీకి కేంద్ర మంత్రివర్గంలో ఐదు మంది కి మంత్రి పదవులు కేటాయించాలని చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ గారిని కోరునట్లు తెలుస్తోంది ఈ నేపద్యంలో రాయలసీమ జిల్లాల నుంచి కచ్చితంగా ఒక మంత్రి పదవి దక్కి అవకాశం ఉంది కనుక సీనియర్ అయిన బీకే పార్థసారధికే మంత్రి పదవి దక్కుతాదనే సమాచారం బికె పార్థసార సైతం తమకు మంత్రి పదవి కేటాయించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని కోరునట్లు తెలుస్తోంది
=================