పేదల ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించండి.. ఎమ్మెల్యేశిల్పా రవిరెడ్డి…

సిరా న్యూస్,నంద్యాల;
నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డు బొమ్మల సత్రంలో 193వ రోజు మంగళవారం ఉదయం ఏడు గంటల నుండి గడపగడపకు మా ప్రభుత్వ కార్యక్రమంలో నంద్యాల శాసనసభ్యులు పాల్గొన్నారు ముందుగా ఎమ్మెల్యేకు వార్డు వైసిపి నాయకులు స్వాగతం పలికారు గడప గడప తిరుగుతూ లబ్ధిదారులతో ఆప్యాయంగా పలకరిస్తూ సంక్షేమ పథకాలు వివరించారు ప్రజలు కూడా వారికి ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు వాటిని అక్కడికక్కడే పరిష్కరించడం తో ప్రజలు ఎమ్మెల్యే శిల్పారవి రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు…
ఈ సందర్భంగా నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో దాదాపు అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నామని అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజల కుటుంబంలో సంతోషాన్ని నింపుతున్నాయని ఏక్కడికి వెళ్లిన ప్రజలు జగనన్నను నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారనిఎన్నడు లేని విధంగా నంద్యాల నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని ముఖ్యంగా మెడికల్ కళాశాల అలాగే జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ వైయస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లు నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఏర్పాటు చేయడం జరిగిందని వైయస్సార్ ప్రభుత్వంలో విద్య వైద్యానికి పెద్దపీట వేస్తున్న ఏకైక నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇంతటి మంచి మనసున్న ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు…
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు శశికళ రెడ్డి, వార్డు ఇంచార్జ్ కాసిం, నంద్యాల జిల్లా వైఎస్ఆర్సిపి జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు, మాధవరెడ్డి, డి. దస్తగిరి, అశోక్ రెడ్డి, ఆర్టీసీ భాస్కర్ రెడ్డి ,జమాల్ బాషా, అనంతలక్ష్మి, ఖాద్రి, షరీఫ్, నాగరాజు, సన్నీ, రమణ, శివాజీ రావు, రమణారెడ్డి, విజయ్ కుమార్ ,వైసీపీ నాయకులు అమృత రాజ్, వైసిపి యూత్ నాయకులు రెవెన్యూ అధికారులు మున్సిపల్ సిబ్బంది సచివాలయ వార్డ్ వాలంటీర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *