రక్తదానం మానవత్వం యొక్క నిజమైన ప్రతీక

 సిరా న్యూస్,హైదరాబాద్ ;
రక్తదానం మానవత్వం యొక్క నిజమైన చర్య అని, ప్రమాదాల వల్లనైనా, మరే ఇతర కారణాల వల్లనైనా శరీరము ఎక్కువ పరిమాణములో రక్తాన్ని కోల్పోతే, ఆ లోటును రక్తంతో మాత్రమే భర్తీ చేయటం సాధ్యమవుతుంది అని మదర్ మేరి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ సాయి చౌదరి అన్నారు. ప్రకాష్ నగర్ కాలనీలో మదర్ మేరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్త దాన శిబిరం నిర్వహించారు.. ఈ సందర్భంగా సాయి చౌదరి మాట్లాడుతూ సరైన సమయంలో కనుక వారికి రక్తం ఇవ్వగలిగితే వారి విలువైన ప్రాణాలను కాపాడ గలుగుతాం అని, ఒక్క ప్రమాదాలలోనే కాదు, అత్యవసర శస్త్ర చికిత్సలు, క్లిష్టమైన ప్రసవాలలో, అనేమియా వంటి తీవ్ర అనారోగ్య పరిస్థితులలో కూడా రక్తం అవసరం ఎక్కువగా ఉంటుంది అని, రక్తానికి ప్రత్యామ్నాయం లేదు అని, రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేము అని, అందువల్ల మనము చేసే రక్త దానమే వాళ్లకు ప్రాణదానంగా మారుతుంది అని మదర్ మేరి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ సాయి చౌదరి అన్నారు
====

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *