సిరా న్యూస్,హన్మకొండ;
కాకతీయ యూనివర్సిటీ పోతన గర్ల్స్ హాస్టల్ లో స్లాబ్ పై పెచ్చులు ఊడి కింద పడడం జరిగింది. అదృష్టం కొద్దీ ఆ రూంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇటీవల ఫ్యాను ఊడి మీద పడి ఒకరి తల పగిలిన ఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. అధికారులు హడావిడి చేశారు కానీ హాస్టల్ లో ఉన్న వారిని చేంజ్ చేసే ప్రయత్నం అయితే ఎవరు చేయలేదు. తరుచు ప్రమాదాలు జరుగుతున్న కాకతీయ యూనివర్సిటీలో ఎవరు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ భవనం పెచ్చులు ఊడి పడతాయా, ఎవరిపై ఫ్యాన్లు ఊడి పడతాయా అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో గడుపుతున్న పరిస్థితి వుంది. ఇప్పటికైనా అధికారులు రాజకీయ నాయకులు స్పందించి కొత్త భవనాలను నిర్మించి విద్యార్థులకు అన్ని వసతులు ఉన్న భవనాలలోకి హాస్టల్స్ మార్చాలని విద్యార్థులు వేడుకుంటున్న పరిస్థితి కాకతీయ యూనివర్సిటీలో నెలకొంది.
నగర కార్పొరేషన్ అధికారులు వర్షాకాలం నేపథ్యంలో పురాతన భవనాలు కూలి ప్రాణ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో గత కొన్ని రోజుల క్రితం వాటి జాబితా సిద్ధం చేసి కూల్చివేయాలని సూచించారు.
=======================