సిరా న్యూస్, కుందుర్పి
సంపద సృష్టి చేసి ఇవ్వగల నాయకుడు చంద్రన్న
స్టీల్ ప్లాంట్ సాధన కమిటీ అధ్యక్షులు బీఎం నాదల్
సంపద సృష్టి చేసి ఇవ్వగల నాయకుడు చంద్రన్న అని స్టీల్ ప్లాంట్ సాధన కమిటీ అధ్యక్షులు బీఎం నాదల్ అన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రన్న హైదరాబాద్ ఐటీ పరిశ్రమ సంవత్సరానికి రెండు లక్షల కోట్ల సంపద అని అంతేకానీ జగన్ రెడ్డి లాగా గంజాయి డ్రగ్స్ మాఫియా ఎర్రచందనం స్మగ్లర్లకు, నేర చరిత్ర ఉన్న నేరస్తులకు అసెంబ్లీ సీట్లు ఇవ్వటం ఇది కాదు జగన్ రెడ్డి లాగా రైతు పాసు బుక్కు మీద జగన్ బొమ్మ పెట్టుకోవటం, రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒకటి లేదా సెంటు స్థలం ను వాటి ఒరిజినల్ డాక్యుమెంట్ ఇవ్వకుండా పేదల పొట్టు కొట్టే కార్యక్రమం చేయటం టైటిల్ యాక్ట్ అని పెట్టి కోర్టులకు వెళ్లకుండా ఆస్తులు కొల్లగొట్టడం వీటిని కొల్లగొట్టే కార్యక్రమాలు వైసిపి ప్రభుత్వం చేయటం తప్పు బాట్టారు. చంద్రబాబు నాయుడు ఆర్థిక రాజధాని విశాఖ కోసం ఐటి కంపెనీలు, రాజధాని నిర్మాణం కోసం 30 నాలుగు వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులు అమరావతి ఆంధ్రప్రదేశ్ కు మధ్య ప్రాంతం ఈశాన్యంలో కృష్ణమ్మ పరవళ్ళు అదే ఈశాన్యంలో పట్టిసీమ, పోలవరం కాలువల ద్వారా నీటిని, ప్రకాశం జిల్లాకు పేపర్ మిల్లు,అనంతపురం కు కియా, ఐటీ,మెట్రో తీర ప్రాంతాల అభివృద్ధి, సంపద సృష్టి చేయడం అంటే ఇదే చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమన్నారు.ఈ సందర్భంగా శ్రీనివాసులు మంచి మెజారిటీతో గెలిపించి రాయదుర్గంలో సంపద సృష్టించుకోవాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ లీడర్లు, బీఎల్వో లు భారీ ఎత్తున పాల్గొన్నారు.